16.12.2025_రాష్ట్రంలో మొదటిసారిగా 22A కేసుల పరిష్కారంపై ఏలూరులోప్రత్యేకవేదిక_జిల్లా ఇంచార్జ్ మంత్రి
Автор: diproelr
Загружено: 2025-12-16
Просмотров: 29
16.12.2025_*రాష్ట్రంలో మొదటిసారిగా 22A కేసుల పరిష్కారంపై ఏలూరులో ప్రత్యేక వేదిక*
గత ప్రభుత్వం రాజకీయ కక్షల కారణంగా భూ సమస్యలు పెరిగాయి
జిల్లాలోని 22A భూ సమస్యలలో 90 శాతం ఈరోజే పరిష్కరిస్తాం
దేవాదాయ భూములు, వంటి వాటిని 1 లేదా 2 వారాలలో పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారు
ఏలూరులో మంగళవారం నిర్వహించిన 'మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక'లో ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు, డిసెంబర్, 16 : రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం 'మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జేసి అభిషేక్ గౌడ, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డా. కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు అతి పెద్ద సమస్యగా రూపొందాయని, ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశ్యపూర్వకంగా 22A జాబితాలో చేర్చారని, గత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా లేని వారి భూములను 22A , చుక్కలు భూములు వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారన్నారు. దీనికారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. 22A కింద నమోదైన భూములలో జిరాయితీ భూములు ఉండడంతో సదరు భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని జిల్లాలోనూ 22A కింద పొరపాటుగా నమోదైన భూములను సదరు జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారన్నారు. జిల్లాలోని 27 మండలాలకు చెందిన రైతులు, ప్రజలు 22A జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల వివరాలను సదరు యజమానులు నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈరోజు కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అందిన ప్రతీ అర్జీని పరిశీలించి 90 శాతం వరకు అదేరోజు పరిష్కరించడం జరుగుతుందన్నారు. దేవాదాయ భూములు, వంటి సమస్యలు ఉన్న భూములను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 22A భూ సమస్యల పరిష్కార విషయంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: