1.54 లక్షల కుటుంబాలకు రూ. 104 కోట్లు అన్నదాత సుఖీభవ: కలెక్టర్
Автор: JDRNEWS
Загружено: 2025-11-19
Просмотров: 33
జిల్లాకు చెందిన 1,54,908 రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున రూ.104.15 కోట్ల నగదు జమ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
నాయుడుపేట లో పండుగ వాతావరణంలో జిల్లాలో అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ 2వ విడత కార్యక్రమం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
బుధవారం నాయుడుపేటలోని శ్రీనివాసా కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ 2వ విడత నగదు జమ చేసే కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తో కలసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. చైర్మన్ కె.వి నాయుడు, అగ్రికల్చర్ జెడి ప్రసాదరావు, నాయుడుపేట అగ్రికల్చర్ ఏడి నాగార్జునసాగర్, డిపిఎం షణ్ముగం, సూళ్లూరుపేట, నాయుడుపేట అగ్రికల్చర్ అధికారులు వీఎవోలు,స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: