శ్రీ కోటమ్మతల్లి ఆలయం ప్రాంగణంలోని శ్రీ భవాని శంకర స్వామి అలయంలో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమం..
Автор: శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయం_కోట
Загружено: 2025-11-17
Просмотров: 146
తిరుపతి జిల్లా, కోట మండలం, కోట పట్టణంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కోట గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి ఆధ్వర్యంలో వేద పండితులు కుందర్తి సుధాకర్ స్వామి బృందం మంత్రోత్సరణలతో శ్రీ భవాని శంకర స్వామి వారికి కార్తీక మాస రుద్రాభిషేకం వైభవంగా జరిపించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి - లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో అన్నాభిషేకం చేపట్టారు. ముందుగా ఉదయం గోపూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వనభోజన కార్యక్రమాన్ని చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మంగళ హారతులిచ్చారు.. ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి సుమారు 5 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. అలాగే ప్రత్యేకంగా అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ కోటమ్మతల్లి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన దాతలు, భక్తులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవాసమితి నిర్వహకులు అల్లం రమణయ్య, పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి, కొండూరు వెంకట రమణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, బల్లవోలు సుధాకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: