బీహార్ ఎన్నికల్లో ఘన విజయంపై రాయదుర్గంలో BJP సంబరాలు
Автор: RDG NEWS
Загружено: 2025-11-14
Просмотров: 2455
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కూటమి ఘన విజయం సాధించడంతో రాయదుర్గం పట్టణంలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. శుక్రవారం మద్యాహ్నం బిజెపి కౌన్సిలర్లు పెద్ద వన్నూరప్ప, డిష్ గోవిందు, షబ్బీర్, శ్రీనివాస్ రెడ్డి, ఏటూరి మహేష్ ల ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కూడలిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాదవ్, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదేశాలతో విజయోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే అందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వమేనని స్పష్టం చేశారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, అవినీతి రహిత పాలన అందిఇస్తున్నదని అన్నారు. బిజెపి కూటమి కి అత్యదిక మెజారిటీతో 190కి పైగా అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: